నిర్మల్ : రాష్ట్రంలో ఆలయాల అభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్దపీట వేస్తున్నారని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి స్పష్టం చేశారు. సొన్ మండలం న్యూ వెల్మల్ గ్రామంలో రూ. 66 లక్షల నిధులతో నూతనంగా నిర్మించిన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమానికి బుధవారం మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి హాజరై పూజలు చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. వెంకటేశ్వర స్వామి ఆలయానికి రూ. 66 లక్షలు నిధులు మంజూరు చేశామని అన్నారు. ఇప్పటివరకు రూ. 30 లక్షలతో పనులు పూర్తి చేసామని తెలిపారు. మరో రూ. 36 లక్షలతో ప్రహరి గోడ, ఇతర అభివృద్ధి పనులు చేస్తామన్నారు. నిర్మల్ నియోజకవర్గంలో దాదాపు 500 పై చిలుకు దేవాలయాలను అభివృద్ధి చేసుకున్నామని అన్నారు.
ఈ కార్యక్రమంలో జడ్పి చైర్ పర్సన్ విజయ లక్ష్మి రాంకిషన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే వేణుగోపాల్ చారి, అల్లోల మురళీధర్ రెడ్డి , ఎఫ్ఎస్సీఎస్ చైర్మన్ ధర్మజి రాజేందర్, సర్పంచ్ హరిత శ్రీనివాస్, జడ్పిటిసి జీవన్ రెడ్డి, మండల నాయకులు మోహినోద్దీన్, కృష్ణ ప్రసాద్, వినోద్, ఆత్మ చైర్మన్ గంగ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.