యాదాద్రి, జనవరి 21 : యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారిని శుక్రవారం దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి దర్శించుకున్నారు. ఈ సందర్భంగాఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అర్చకులు మంత్రికి ఘన స్వాగతం పలికి వేద ఆశీర్వచనం చేశారు.
ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేసి..శేషవస్త్రంతో సత్కరించారు. అనంతరం ఆలయ అభివృద్ధి పనులను, ప్రసాద తయారీ, విక్రయ కేంద్రాలను మంత్రి పరిశీలించారు.
ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ గొంగిడి సునీత రెడ్డి, దేవదాయ శాఖ కమిషనర్ అనిల్ కుమార్, వైటీడీఏ వైస్ చైర్మన్ కిషన్ రావు, ఆలయ ఈవో గీతా రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.