రాజన్న సిరిసిల్ల :వేములవాడ పర్యటనలో భాగంగా దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి నాగారంలోరూ.36 లక్షల అంచనా వ్యయంతో పునఃనిర్మించనున్న కోదండ రామాలయానికి భూమి పూజ చేశారు. అనంతరం వేములవాడలో భక్తుల సౌకర్యార్థం నిర్మించిన భీమేశ్వర స్వామి అతిథి గృహాన్ని ప్రారంభించారు. అంతకుముందు వేములవాడ రాజరాజేశ్వరస్వామి వారిని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి దర్శించుకున్నారు.
మంత్రికి ఆలయ అర్చకులు ఘన స్వాగతం పలికారు. స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. మంత్రి వెంట ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్, దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్ కుమార్, తదితరులు ఉన్నారు.