నిర్మల్ : జిల్లా కేంద్రంలోని మైనారిటీ బాలికల గురుకుల పాఠశాలను మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి సందర్శించారు. వర్షాలు, లీకేజీల వల్ల పాఠశాల ప్రాంగణం తరగతి గదుల్లో నీరు నిలవడాన్ని గమనించిన మంత్రి.. వెంటనే అక్కడ నుంచే సంబంధిత అధికారులకు ఫోన్ చేసి మరమ్మతులు చేపట్టాలని ఆదేశించారు.
వర్షాల వల్ల విద్యార్థులకు తలెత్తిన సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం వంటగదిని, వంటకాలను, వంట సామానులను పరిశీలించారు. విద్యార్థినిలతో ముచ్చటించి బోధన, కనీస వసతుల గురించి అడిగి తెలుసుకున్నారు. విదార్థినులకు నాణ్యమైన తాజా ఆహారాన్ని అందించాలన్నారు. ఏమైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు.