హైదరాబాద్, జూలై 8: గాయకుడు సాయిచంద్ కుటుంబాన్ని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పరామర్శించారు. గుర్రంగూడలోని సాయిచంద్ స్వగృహానికి వెళ్లి.. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. సాయిచంద్ ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థించారు. అనంతరం కుటుంబ సభ్యులతో మాట్లాడు. అధైర్య పడొద్దు అండగా ఉంటామని వారికి ధైర్యం చెప్పారు.
కాగా, బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధుల నుంచి సేకరించిన నిధులతో సాయిచంద్ కుటుంబానికి కోటిన్నర చొప్పున ఆర్ధిక సహాయం, వారి పేరంట్స్కు 25లక్షల చొప్పున సహాయం అందించారు. అలాగే సాయిచంద్ సతీమణి రజనికి గిడ్డంగుల సంస్థ చైర్ పర్సన్ గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.