నిర్మల్, అక్టోబర్ 26 (నమస్తే తెలంగాణ): రైతుబంధును ఆపాలని ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేయడంతో కాంగ్రెస్ రైతు వ్యతిరేక పార్టీ అని మరోసారి రుజువైందని మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి ఆరోపించారు. ఈ చర్యను బీఆర్ఎస్ ప్రభుత్వం తీవ్రంగా ఖండిస్తున్నదని అన్నారు. తెలంగాణ రైతులు, ప్రజలు సైతం ఆ పార్టీని వ్యతిరేకించాలని ఆయన పిలుపునిచ్చారు.
గురువారం ఆయన నిర్మల్లోని తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. వచ్చే యాసంగికి సంబంధించి రైతుబంధు డబ్బులను రైతుల ఖాతాల్లో జమ చేయొద్దంటూ కాంగ్రెస్ నాయకులు ఢిల్లీలోని ఈసీకి ఫిర్యాదు చేయడం శోచనీయమని అన్నారు. రైతాంగంపై కాంగ్రెస్ కపట ప్రేమ బట్టబయలైందని విమర్శించారు. రైతాంగానికి నష్టం చేసే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఓట్ల కోసం గ్రామాలకు వస్తే ఎక్కడికక్కడ నిలదీసి బుద్ధిచెప్పాలని సూచించారు.