యాదాద్రి భువనగిరి : శ్రీ లక్ష్మీనరసింహాస్వామి వారి దివ్య విమాన గోపురం స్వర్ణ తాపడనికి రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి ఆలోల ఇంద్రకరణ్ రెడ్డి కుటుంబంతో పాటు బంధువుల ఆధ్వర్యంలో రూ. 99,08, 454 విరాళం సమర్పించారు.
బ్రహ్మోత్సవాల్లో భాగంగా బాలాలయంలో నిర్వహించిన కల్యాణ వేడుకలో పాల్గొన్న మంత్రి..ఆలయ ఈవో కు చెక్కు, నగదును అందజేశారు. అంతకు ముందు స్వామివారి తిరు కల్యాణానికి ప్రభుత్వం తరుపున మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ప్రభుత్వ విప్ గొంగిడి సునీతా మహేందర్ రెడ్డి దంపతులతో కలిసి పట్టువస్త్రాలు సమర్పించారు.