నిర్మల్ : పవిత్రమైన బక్రీద్ పర్వదినాన్ని పురస్కరించుకొని ముస్లిం సోదరులకు అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలందరికి అల్లా ఆశీస్సులు ఎల్లప్పుడూ లభించాలని అభిలషించారు. త్యాగానికి ప్రతీకైన బక్రీద్ పండుగను ముస్లింలు ఎంతో భక్తి శ్రద్ధలతో, ఆనందంగా జరుపుకోవాలన్నారు.
బక్రీద్ పండుగ.. జీవితంలో ఎదురయ్యే సమస్యలకు వెరవకుండా దేవునిపై విశ్వాసంతో సన్మార్గంలో జీవించాలని మానవాళికి గొప్ప సందేశాన్ని ఇస్తుందన్నారు. ఆయన వెంట స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు ఉన్నారు.
అనంతరం మంత్రి నిర్మల్ పట్టణంలోని ఈద్గావ్ చౌరస్తా నుంచి సీద్దాపుర్కు వెళ్లే రోడ్డను పరిశీలించారు. ఆదర్శ నగర్ కాలనీ వాసులతో మాట్లాడారు. గుంతలు పూడ్చి తాత్కాలికంగా రోడ్డు ను బాగు చేసి, దసరా వరకు బీటీ రోడ్ పూర్తి చేస్తామని మంత్రి హామీనిచ్చారు.