హైదరాబాద్, ఆగస్టు 1 (నమస్తే తెలంగాణ) : వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి దేవాదాయ శాఖ అధికారినే ఈవోగా నియమించాలని అర్చక ఉద్యోగ జేఏసీ విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు మంగళవారం జేఏసీ చైర్మన్ గంగు ఉపేంద్ర శర్మ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డికి వినతిపత్రం అందజేశారు. గతంలో రెవెన్యూ శాఖ నుంచి దేవాదాయ శాఖ విడిపోయినా ఇంకా వారినే ఈవోలుగా నియమించడం సరికాదని పేర్కొన్నారు.