నిర్మల్ అర్బన్ : తెలుగు సంవత్సరాది ఉగాది పర్వదినం (శ్రీ శుభకృత్ నామ సంవత్సరం) సందర్భంగా దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి రెడ్డి రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ‘శుభకృత్’ అంటే శుభాలను కలిగించేదని.. పేరుకు తగ్గట్టుగా కొత్త ఏడాదిలో అందరికీ శుభమే జరగాలని ఆకాంక్షించారు. ఈ పండుగను ఆనందంగాను, ఉత్సాహంగా జరుపుకోవాలని, ప్రజలంతా ఆయురారోగ్యాలతోను, అష్టైశ్వర్యాలతోను తులతూగాలని అభిలాషించారు. ఈ సంవత్సరంలో కరోనా మహమ్మారి నుంచి కొంత ఉపశమనం పొందగలిగామని, ‘శుభకృత్’ ఉగాదిలో కరోనా పూర్తిగా తొలగిపోవాలని కోరుకున్నట్లు పేర్కొన్నారు.