హైదరాబాద్ : దివంగత మాజీమంత్రి నాయిని నరసింహా రెడ్డికి దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి నివాళులర్పించారు. నాయిని నరసింహా రెడ్డి ప్రథమ వర్ధంతిని పురస్కరించుకుని లోయర్ ట్యాంక్బండ్లోని పింగళి వెంకట్రామ్ రెడ్డి ఫంక్షన్ హాల్ లోజరిగిన కార్యక్రమంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పాల్గొన్నారు.
నాయిని చిత్రపటానికి ఆయన పుష్పాంజలి ఘటించారు. తెలంగాణ ఉద్యమంలో నాయిన పాత్ర మరువలేనిదన్నారు. కార్మికుల సమస్యల పరిష్కారం కోసం నరసింహారెడ్డి నిరంతరం పోరాడారని మంత్రి కొనియాడారు.