హైదరాబా ద్, ఆగస్టు 7 (నమస్తే తెలంగా ణ): రాష్ట్రంలో దివ్యాంగుల సం క్షేమానికి పెద్దపీ ట వేస్తున్నామని దివ్యాంగుల సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. సోమవా రం సచివాలయంలో రాష్ట్ర దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ కే వాసుదేవ రెడ్డితో కలిసి మంత్రి సమీక్ష నిర్వహించారు. దివ్యాంగులకు బ్యాటరీ సైకిళ్ల కొనుగోలు, సంస్థ ఉద్యోగుల పీఆర్సీ అమలు, దివ్యాంగులకు ఆత్మగౌరవ భవనం, సదరం సర్టిఫికెట్లు, దివ్యాంగుల చట్టం తదితర అంశాలపై చర్చించారు. దివ్యాంగులశాఖలో ఉన్న సమస్యలను పరిషరించేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలని అధికారులకు సూచించారు. దివ్యాంగుల సహకార సంస్థ జీఎం ప్రభంజన్రావు, ఏడీ రాజగోపాల్ పాల్గొన్నారు.