హైదరాబాద్: తెలుగు నూతన సంవత్సరాది శ్రీ శుభకృత్ నామ సంవత్సర ఉగాది పర్వదినం సందర్భంగా మంత్రి హరిశ్ రావు రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. శుభకృత్లో అంతా శుభం జరగాలని ఆకాంక్షించారు. తెలుగు నూతన సంవత్సరాన్ని ఆనందోత్సాహాలతో, సుఖసంతోషాల మధ్య అన్ని వర్గాల ప్రజలు జరుపుకోవాలన్నారు. అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. ఈ ఏడాది అన్నిరంగాల్లో పురోభివృద్ధిని సాధించాలన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు అందడం సంతృప్తినిచ్చిందని చెప్పారు.
శ్రీ శుభకృతునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. #happyugadi pic.twitter.com/U6IwEFidTx
— Harish Rao Thanneeru (@trsharish) April 2, 2022
కాలంతో ప్రమేయం లేకుండా కాళేశ్వరం జలాలతో కాలువలు, చెరువులు, కుంటల్లో నీళ్లు సమృద్ధిగా నిండి ఉన్నాయని చెప్పారు. రైతులు ఆనందంతో పాడి పంటలతో వర్ధిల్లాలన్నారు. గత రెండు సంవత్సరాలు కరోనాతో పండగను వేడుక జరుపుకోలేక పోయామని చెప్పారు. ఈ శుభకృత్ సంవత్సరంలో అన్నింటా అందరికి శుభం జరగాలని భగవంతుణ్ణి ప్రార్ధించారు.