యాదాద్రి భువనగిరి : వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్రావు ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు యాదాద్రి రానున్నారు. యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానంలో దివ్య విమాన గోపురం బంగారు తాపడానికి బంగారం విరాళం అందజేసేందుకు మంత్రి రానున్నారని ఆలయ వర్గాలు తెలిపాయి.
అనంతరం స్థానికంగా జరిగే టీఆర్ఎస్ యువజన, విద్యార్థి, సోషల్ మీడియా నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొంటారు.