సిద్దిపేట : సిద్దిపేట జిల్లా కేంద్రంలో ఫీవర్ సర్వే కొనసాగుతోంది. 37వ వార్డులో కొనసాగుతున్న ఫీవర్ సర్వేలో రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు పాల్గొన్నారు. ఆరోగ్య కార్యకర్తలతో కలిసి ఈ సర్వేను ఆయన స్వయంగా పరిశీలించారు.
టీకా వేసుకున్నారా..! జ్వరం, జలుబు, దగ్గు లాంటి లక్షణాలు ఉంటే చెప్పాలని ప్రజలకు హరీశ్రావు సూచించారు. మాస్క్ ధరించి, జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు మంత్రి విజ్ఞప్తి చేశారు.
కరోనా కట్టడిలో భాగంగా రాష్ట్రంలో శుక్రవారం నుంచి జ్వర సర్వే ప్రారంభమైన విషయం తెలిసిందే. ఇంటింటా జ్వర సర్వే నిర్వహించి, ప్రజలందరీ ఆరోగ్య వివరాలను ఆరోగ్య శాఖ సేకరిస్తోంది. కరోనా లక్షణాలు ఉన్నవారికి తక్షణమే కొవిడ్ కిట్ను అందజేస్తున్నారు. కోటి కొవిడ్ కిట్లను అన్ని ప్రభుత్వ ఆస్పత్రులకు అధికారులు పంపారు. కిట్లో అజిత్రో మైసిన్, పారాసిటమాల్, లెవో సిట్రిజన్, రానిటిడైన్, విటమిన్ సీ, డీ మెడిసిన్స్ తో పాటు మల్టీ విటమిన్ ట్యాబెట్లను అందజేస్తున్నారు. నాలుగైదు రోజుల్లో జ్వర సర్వేను పూర్తి చేయాలని ఆరోగ్య శాఖ అధికారులను ప్రభుత్వం ఆదేశించింది.