హైదరాబాద్, ఏప్రిల్ 21 (నమస్తే తెలంగాణ): ప్రారంభానికి సిద్ధమవుతున్న నూతన సచివాలయాన్ని ఉద్దేశిస్తూ ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి హరీశ్రావు శుక్రవారం ఆసక్తికర ట్వీట్ చేశారు. ‘మనం గొప్ప భవనాలు నిర్మిస్తే.. అవి మనల్ని గొప్పగా తీర్చిదిద్దుతాయి’ అనే అమెరికా మాజీ అధ్యక్షుడు విన్స్టన్ చర్చిల్ వ్యాఖ్యను మంత్రి ఉటంకించారు.
‘డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయం ఈ నెల 30వ తేదీన సీఎం కేసీఆర్ చేతులమీదుగా ప్రారంభానికి సిద్ధమైంది’ అని మంత్రి ట్వీట్ చేశారు. తెలంగాణ సచివాలయాన్ని గొప్ప సౌధంగా ప్రభుత్వం తీర్చిదిద్దిందని, అది దేశం ముందు మనం తలెత్తుకొని నిలబడేలా చేస్తుందనే ఉద్దేశం వచ్చేలా విన్స్టన్ చర్చిల్ వ్యాఖ్యలను జోడించారు. సచివాలయ అద్భుత ఫొటోలు కొన్నింటిని జత చేశారు. ఇవి చూడగానే ‘అదరహో’ అనిపించేలా ఉన్నాయి.