హైదరాబాద్, నవంబర్ 13 (నమస్తే తె లంగాణ): తాను రోజుకు ఒకట్రెండు కిలోల తిట్లు తింటానని, అవే తనకు బలాన్ని ఇస్తున్నాయన్న ప్రధాని మోదీ వ్యాఖ్యలు హాస్యాస్పదమని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు అన్నా రు. ‘ప్రత్యర్థుల తిట్లను కిలోల లెక్క బేరీజు వేస్తూ అవే తన బలం అని మోదీ అంటున్నారు.
ఈ లెక్కన తెలంగాణ బీజేపీ నేతల టన్నుల కొద్దీ తిట్లు సీఎం కేసీఆర్ను ఇంకెంత బలవంతుడిని చేసి ఉంటాయి మోదీ? దేశానికి, తెలంగాణకు ఏం చేశావని మేము అడిగితే తిట్ల పేరిట పలాయన పల్లవి ఎత్తుకోవడం భావ్యమా? అని హరీశ్రావు ట్విట్టర్లో ప్రశ్నించారు.