హైదరాబాద్: పీహెచ్సీలు, ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవాలు పెరగాలని మంత్రి హరీశ్ రావు అన్నారు. సాధారణ ప్రసవాలు ప్రోత్సహించాలని అధికారులకు సూచించారు. హెల్త్ క్యాలెండర్ ప్రకారం ఆశాలు, ఏఎన్ఎంలతో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో వైద్యారోగ్య శాఖ కార్యదర్శి, డీహెచ్, డీఎంఈ పాల్గొన్నారు. జూన్ చివరి నాటికి ఎన్సీడీ స్క్రీనింగ్ వంద శాతం పూర్తిచేయాలన్నారు. మంచి పనితీరు కనబర్చితే ప్రత్యేక గుర్తింపు లభిస్తుందని, విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని స్పష్టం చేశారు. దవాఖానల్లో ఈ-ఔషధి ద్వారానే మందుల పంపిణీ జరగాలని సూచించారు. డీఎంహెచ్వో, డీప్యూటీ డీఎంహెచ్వోలు పీహెచ్సీల వారీగా సమీక్షలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.