హైదరాబాద్ : ప్రజలకు మెరుగైన ఆర్థోపెడిక్ సేవలు అందించాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావు అధికారులను ఆదేశించారు. ఎంసీఆర్ హెచ్ఆర్డీలో ప్రభుత్వ, ప్రముఖ ప్రైవేట్ ఆర్థోపెడిక్ వైద్యులతో సమావేశమై.. రాష్ట్రంలో అందిస్తున్న ఆర్థోపెడిక్ సేవలపై సమీక్ష నిర్వహించారు. సంబంధిత విభాగంలో ప్రజలకు అందుతున్న సేవలపై ఆరా తీశారు. అవసరమైన నూతన వైద్య విధానాల గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆర్థో వైద్య నిపుణుల నుంచి సలహాలు, సూచనలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన సేవలందించేలా చూడాలని, ఈ మేరకు చర్యలు తీసుకోవాలని డీఎంఈ రమేశ్రెడ్డి, టీఎస్ ఎంఎస్ ఐడీసీ ఎండీ చంద్రశేఖర్రెడ్డిని ఆదేశించారు.
ఆసుపత్రులకు డెవలప్మెంట్ కింద ఆరోగ్యశ్రీ నిధులను విడుదల చేసిందని, ఈ నిధులను స్థానికంగా సూపరింటెండెంట్లు వినియోగించుకొని.. ఎప్పటికప్పుడు తగిన ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. ప్రైవేట్ హాస్పిటల్స్తో పోటీ పడి ప్రభుత్వ హాస్పిటల్స్లో ఆర్థోపెడిక్ వైద్యసేవలను అందించాలని, మోకాలి చిప్ప మార్పిడి సర్జరీకి కావాల్సిన అన్ని వసతులను ప్రభుత్వ ఆసుపత్రుల్లో సమకూర్చామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 56 సీఆర్మ్ మిషన్లు ఏర్పాటు చేశామని, మోకాలి చిప్ప మార్పిడి సర్జరీలు, ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే జరగేలా చూడాలి, దీని వల్ల పేదలకు ఆర్థిక భారం తప్పుతుందన్నారు. సూపరిడెంట్స్ ఆర్థోపెడిక్ వైద్యులకు సహకారం అందించాలని, అన్ని రకాల ఆర్థో చికిత్సలను ఆరోగ్యశ్రీ పథకం కింద అవకాశం ఉందన్నారు.
మన వద్ద అనుభవజ్ఞులైన వైద్యులున్నారని, వారికి తగిన ఏర్పాట్లు చేశామన్న మంత్రి.. పేదలకు వైద్యం బాధ్యత మన అందరిదన్నారు. సమావేశంలో వైద్య, ఆరోగ్యశాఖ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ రిజ్వి, టీఎస్ ఎంఐడీసీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, డీఎంఈ రమేశ్ రెడ్డి, నిమ్స్, రిమ్స్, మహబూబ్నగ్, సిద్దిపేట దవాఖానాల డైరెక్టర్లు, టీఎస్ ఎంఎస్ఐడీసీ ఎండీ చంద్రశేకర్రెడ్డి, అన్ని మెడికల్ కాలేజీ హాస్పిటళ్ల సూపరింటెండెంట్లు, ఆర్థోపెడిక్ యూనిట్ హెచ్వోడీలు, ఆర్థోపెడిక్ డాక్టర్లు, జిల్లా ఆసుపత్రుల సూపరింటెండెంట్లు, జిల్లా ఆసుపత్రి ఆర్థోపెడిక్ డాక్టర్లు పాల్గొన్నారు. ప్రైవేటు ఆసుప్రతులకు చెందిన ప్రముఖ ఆర్థోపెడిక్ వైద్యులు గురువారెడ్డి, అఖిల్ దాడి, సూర్య ప్రకాశ్, నితిన్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.