సిద్దిపేట: వర్షాభావ పరిస్థితుల్లో రైతులను ఆదుకోవడమే ప్రథమ కర్తవ్యమని మంత్రి హరీశ్ రావు (Minister Harish Rao) అన్నారు. రాష్ట్రంలో వర్షాలు ఆలస్యమవడంతో సీఎం కేసీఆర్ (CM KCR) ఆదేశాల మేరకు కాళేశ్వరం ప్రాజెక్టు (Kaleshwaram Project) నుంచి రంగయనాక సాగర్లోకి (Ranga Nayaka Sagar) 2 టీఎంసీల గోదావరి నీటిని మంత్రి విడుదల చేశారు. దీంతో మల్లన్నసాగర్, కొండపోచమ్మ సాగర్కు నీళ్లు వెళ్లనున్నాయి. కాగా, వానాకాలం సీజన్ కోసం స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి (Speaker Pocharam Srinivas Reddy).. నిజాం సాగర్ ప్రాజెక్టు నుంచి 1500 క్యూసెక్కుల నీటిని బుధవారం ఉదయం విడుదల చేసిన విషయం తెలిసిందే.