హైదరాబాద్ : గాంధీ ఆస్పత్రిలో తొలి కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీ (cochlear implant surgery) విజయవంతమైంది. వినికిడి లోపంతో బాధపడుతున్న ఓ మూడేండ్ల చిన్నారికి గాంధీ వైద్యులు కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీ నిర్వహించారు. ఆ సర్జరీ విజయవంతం కావడంతో.. గాంధీ వైద్య బృందానికి రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు అభినందనలు తెలుపుతూ ట్వీట్ చేశారు. ప్రయివేటు ఆస్పత్రిలో దాదాపు రూ. 15 లక్షల దాకా ఖర్చయ్యే ఈ చికిత్స సీఎం కేసీఆర్ మార్గనిర్దేశనంలో ఉచితంగా అందుబాటులోకి వచ్చిందని హరీశ్రావు తెలిపారు.
కాక్లియర్ ఇంప్లాంట్ అనేది ఒక చిన్న ఎలక్ట్రానిక్ పరికరం, ఇది అంతర్గత, బాహ్య భాగాలను కలిగి ఉంటుంది. పరికరం ధ్వని యొక్క స్పర్శను అందించడానికి కాక్లియర్ నాడిని (వినికిడి సంబంధిత) ప్రేరేపిస్తుంది. ప్రత్యేకమైన ఇంప్లాంట్ శస్త్రచికిత్స మీకు సరిగా వినడానికి సహాయపడుతుంది. అయితే, ఇది మీ వినికిడి లోపాన్ని పునరుద్ధరించడం లేదా సరిచేయడం వంటివి చేయబడవు.
తొలి కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీ (cochlear implant surgery) చేసి, మూడేళ్ల చిన్నారి వినికిడిలోపాన్ని సరిదిద్దిన గాంధీ వైద్య బృందానికి అభినందనలు. ప్రైవేటులో దాదాపు రూ.15 లక్షల దాకా ఖర్చయ్యే ఈ చికిత్స సీఎం శ్రీ కేసీఆర్ గారి మార్గనిర్దేశనంలో ఉచితంగా అందుబాటులోకి వచ్చింది. pic.twitter.com/Z7OcnAHmM9
— Harish Rao Thanneeru (@trsharish) August 22, 2022