హైదరాబాద్ : మోకాలి శస్త్ర చికిత్స చేయించుకున్న నర్సాపూర్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే మదన్ రెడ్డిని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్రావు శనివారం ఉదయం పరామర్శించారు. మోకాలి నొప్పితో బాధపడుతున్న మదన్ రెడ్డి.. సికింద్రాబాద్లోని సన్షైన్ ఆస్పత్రిలో శస్త్ర చికిత్స చేయించుకున్నారు. ఈ సందర్భంగా మదన్ రెడ్డిని హరీశ్రావు పరామర్శించి, ఆరోగ్య వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్యే మదన్ రెడ్డి త్వరగా కోలుకోవాలని హరీశ్రావు ఆకాంక్షించారు.