సిద్ధిపేట : జగదేవ్పూర్ మండలం మునిగపడ వద్ద జరిగిన రోడ్డు ప్రమాద ఘటనపై మంత్రి హరీశ్రావు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబానికి సానుభూతి తెలిపారు. ఘటనలో గాయపడ్డ వ్యక్తికి మెరుగైన వైద్యం అందించాలని మంత్రి హరీశ్రావు ఆదేశించారు. సహాయక చర్యలు చేపట్టాలని కలెక్టర్, సీపీలను ఆదేశించారు. పోస్టుమార్టం చేసి మృతదేహాలను స్వగ్రామం తరలించాలన్నారు. సాయంత్రం సమయంలో మునిగడప వద్ద గుంతలో కారు బోల్తాపడిన సంఘటనలో ఐదుగురు మృతి చెందారు. మరో వ్యక్తి హైదరాబాద్కు తరలిస్తుండగా.. మృతి చెందారు.
మృతుల్లో ఇద్దరు మహిళలు, మరో ఇద్దరు చిన్నారులున్నారు. మృతులను నల్లగొండ జిల్లా బీబీనగర్కు చెందిన సమ్మయ్య, స్రవంతి, లోకేశ్, రాజమణి, భవ్యశ్రీగా పోలీసులు గుర్తించారు. వీరందరూ ఒకే కుటుంబానికి చెందిన వారని పోలీసులు తెలిపారు. వేములవాడ రాజరాజేశ్వర స్వామిని దర్శించుకుని స్వస్థలానికి తిరిగి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఇదే ఘటనలో తీవ్రంగా గాయపడిన వెంకటేశ్హైదరాబాద్ గాంధీకి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతదేహాలను గజ్వేల్ ప్రభుత్వ ఏరియా ఆసుప్రతికి తరలించగా.. కలెక్టర్ జీవన్పాటిల్, కమిషన్ శ్వేత పరిశీలించారు. మృతదేహాలకు వేగంగా పోస్టుమార్టం నిర్వహించి, స్వస్థలం బీబీనగర్కు తరలించాలని ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ను కలెక్టర్ ఆదేశించారు.