Minister Harish Rao | సిద్దిపేట : ఎస్ఐ, పోలీసు కానిస్టేబుల్( Police Constable ) ఉద్యోగాలకు ప్రిపేరవుతున్న ఉద్యోగార్థులు బాగా కష్టపడి చదివి సిద్దిపేట( Siddipeta ) జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు( Minister Harish Rao ) కోరారు. పోలీసు ఉద్యోగాల కోసం ప్రిపేరవుతున్న అభ్యర్థులకు మెయిన్స్ పరీక్షలకు సంబంధించిన మెటిరీయల్ను సిద్దిపేట సీపీ శ్వేతతో కలిసి మంత్రి హరీశ్రావు అందజేశారు.
ఈ సందర్భంగా మంత్రి హరీశ్రావు మాట్లాడుతూ.. హైదరాబాద్లోని కోచింగ్ సెంటర్లలో ఇస్తున్న మెటిరీయల్నే సిద్దిపేటలోనూ అందిస్తున్నామని తెలిపారు. ఉద్యోగార్థులుగా మీ ఆత్మ విశ్వాసాన్ని చూస్తే చాలా సంతోషంగా ఉంది. మీరంతా ఎంతో కష్టపడి ప్రిలిమ్స్, ఫిజికల్ ఈవెంట్స్ క్లియర్ చేసుకుని మెయిన్స్ సిద్ధపడుతున్నందుకు అందరికీ అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేశారు.
ఇక్కడ కానిస్టేబుల్ పోలీస్ శిక్షణకు వచ్చి ఇప్పటి వరకు ప్రిలిమ్స్, ఫిజికల్ టెస్ట్ క్లియర్ చేసి మీరు మెయిన్స్ ప్రిపేర్ అవుతున్న దరిమిలా మీకు శిక్షణ ఇవ్వబడుతున్నదని మంత్రి తెలిపారు. ఫిజికల్ ట్రైనింగ్ కోసం కూడా మంచి పౌష్టికాహారం పాలు, గుడ్లను అందించినట్లు మంత్రి గుర్తు చేశారు. ఈ శిక్షణకు సహకారం అందిస్తున్న పోలీసు శాఖకు మంత్రి హరీశ్రావు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.