సిద్దిపేట : జిల్లా కేంద్రంలోని కోమటి చెరువు వద్ద నిర్వహించిన సద్దుల బతుకమ్మ వేడుకల్లో మంత్రి హరీశ్రావు కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్రావు మాట్లాడుతూ.. కోమటి చెరువు వద్దకు వచ్చిన అక్కాచెల్లెళ్లకు బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు. బతుకమ్మ పండుగ జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. పుష్పాలను పూజిస్తూ, కులమతాలకు అతీతంగా జరుపుకునే పండుగ బతుకమ్మ అని పేర్కొన్నారు. సిద్దిపేటను అన్నిరంగాల్లో అభివృద్ధి చేసుకున్నామని తెలిపారు. సీఎం కేసీఆర్ ఆశీస్సులతో సిద్దిపేటను అన్నివిధాలుగా అభివృద్ధి చేశామని హరీశ్రావు స్పష్టం చేశారు.