రద్దీ ఉన్న చోట ఓపీ కౌంటర్లు పెంచాలి.. వారంలో దవాఖానల్లో హెల్ప్డెస్క్లు
టీచింగ్ దవాఖానలపై వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు సమీక్ష
హైదరాబాద్, జూన్ 9 (నమస్తే తెలంగాణ): అన్ని ప్రభుత్వ దవాఖానల్లో కనీసం మూడు నెలలకు సరిపడ మందులు అందుబాటులో ఉంచుకోవాలని, ఎక్కడా కొరత రానీయొద్దని వైద్యారోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు ఆదేశించారు. ప్రభుత్వ దవాఖానల్లో రోగుల రద్దీకి అనుగుణంగా ఓపీ కౌంటర్లను పెంచాలని, వారంలోగా అన్ని టీచింగ్ దవాఖానల్లో హెల్ప్డెస్క్లు ఏర్పాటు చేయాలని చెప్పారు. గురువారం ఆయన రాష్ట్రంలోని టీచింగ్ దవాఖానలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రభుత్వ దవాఖానల్లో ఏడాదికి లక్ష కాటరాక్ట్ సర్జరీలను లక్ష్యంగా నిర్దేశించుకోవాలని సూచించారు.
నల్లగొండ మెడికల్ కాలేజీలో డాక్టర్ పుల్లారావు నేతృత్వంలో నెలకు 700 కాటరాక్ట్ సర్జరీలు చేస్తుండటం అభినందనీయమని పేర్కొన్నారు. ఉస్మానియా దవాఖానలో ఈ నెల 6 నుంచి 12 వరకు ‘వరల్డ్ హార్ట్ రిథమ్ వీక్’ పేరుతో మంచి కార్యక్రమం చేపట్టారని సూపరింటెండెంట్ నాగేందర్, కార్డియాలజీ విభాగాధిపతి డాక్టర్ సయ్యద్ ఇమాముద్దీన్ను అభినందించారు. ప్రభుత్వ దవాఖానల్లో పారిశుద్ధ్య నిర్వహణ టెండర్లు త్వరగా పూర్తి చేయాలని సూచించారు. మార్చురీల ఆధునికీకరణపై దృష్టి పెట్టాలని చెప్పారు. సమీక్షలో వైద్యారోగ్య శాఖ కార్యదర్శి రిజ్వి, ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ శ్వేతామహంతి, డీఎంఈ రమేశ్రెడ్డి, టీఎస్ఎంఐడీసీ ఎండీ చంద్రశేఖర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మంత్రి హరీశ్రావు చేసిన కొన్ని కీలక సూచనలు