హైదరాబాద్ : పలు వార్తాపత్రికల్లో ప్రచురితమైన గురుకులాలకు దొడ్డు బియ్యమే అనే వార్త పూర్తిగా అవాస్తవం అని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. ఈ రోజు పత్రికా ప్రకటన విడుదల చేస్తూ తెలంగాణా రాష్ట్రం ఏర్పడిన తర్వాత నుంచీ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల సంక్షేమం కోసం దాదాపు ప్రతినెల పాఠశాలలకు 3000 మెట్రిక్ టన్నులు, సంక్షేమ హాస్టళ్లకు, గురుకులాలకు 14,000 మెట్రిక్ టన్నుల సన్నబియ్యాన్నే పంపిణీ చేస్తున్నామన్నారు.
పాఠశాలల నిర్వాహకులు, ఎంఈవోలు, హాస్టల్ ఇంచార్జిల సమక్షంలోనే గోడౌన్లలో బియ్యం క్వాలిటీ చెకింగ్ చేసిన తర్వాతే ఆయా విద్యాలయాలకు బియ్యం పంపిణీ చేస్తున్నామన్నారు. రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో హాస్టళ్లలో అన్నం ముద్దగా అవుతుందని వచ్చిన వాటిపై డిఫార్మెంట్ ద్వారా తనిఖీ చేసి ఆ కొత్త సన్న బియ్యాన్ని పాత సన్న బియ్యం తో రిప్లేస్ చేయడం జరుగుతుందని మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు.