కరీంనగర్ కార్పొరేషన్, సెప్టెంబర్ 12: అభివృద్ధి, సంక్షేమంలో దేశంలో మనమే ఆదర్శంగా ఉన్నామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. దేశంలో బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లో ఇక్కడి పథకం ఒక్కటైనా ఉన్నదా? అన్ని ప్రశ్నించారు. రాష్ట్రంలో అభివృద్ధి మరింత వేగంగా సాగాలంటే ప్రజ లు బీఆర్ఎస్కు అండగా నిలవాలని సూచించారు. మంగళవారం ఆయన కరీంనగర్లో విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల మాట్లాడుతూ..
ఎన్నికల వేళ కాంగ్రెస్, బీజేపీ పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వారి మాటలు నమ్మి అధికారమిస్తే తెలంగాణలోని సంపదను దోచుకుని రాష్ర్టాన్ని గుడ్డిదీపం చేస్తారని ఆరోపించా రు. బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఇప్పటికీ తాగునీరు, కరెంట్ కోసం కష్టాలు పడుతున్నారని పేర్కొన్నారు. తెలంగాణలో ప్రతి ఇంటికి తాగునీరు అందించడంతో పాటు, వ్యవసాయానికి 24 గంటలు నాణ్యమైన కరెంటు అందిస్తున్నామని పేర్కొన్నారు.