ఖమ్మం: గడిచిన 75 ఏండ్లలో బీసీలను ఏ ప్రభుత్వం పట్టించుకోలేదని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. సీఎం కేసీఆర్ బీసీల అభివృద్ధికి కృషి చేస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలో రెండు వందల బీసీ గురుకులాలను ఏర్పాటు చేసిన ఘనత సీఎం కేసీఆర్దేనని స్పష్టం చేశారు. ఖమ్మం జిల్లా కేంద్రంలో నిర్మించిన తెలంగాణ బీసీ స్టడీసర్కిల్ను మంత్రి పువ్వాడ అజయ్తో కలిసి గంగుల ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. బీసీల సర్వతోముఖాభివృద్ధికి టీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తున్నదని చెప్పారు. బీసీల కోసం స్టడీ సెంటర్లు ఏర్పాటు చేశామన్నారు. సీఎం కేసీఆర్కు బీసీలు రుణపడి ఉంటారని వెల్లడించారు.