హైదరాబాద్, సెప్టెంబర్6 (నమస్తే తెలంగాణ): కోకాపేటలో ప్రభుత్వం కేటాయించిన రెండెకరాల స్థలంలో ఈ నెల 11న సగర లేదా ఉప్పర కుల ఆత్మగౌరవ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నట్టు బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్, పర్యాటక, ఎక్సైజ్శాఖ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ వెల్లడించారు. ఈ మేరకు భూమిపూజ కార్యక్రమం కోసం రూపొందించిన పోస్టర్ను బుధవారం వారు ఆవిష్కరించారు. ప్రభుత్వం స్థలం కేటాయించడంతోపాటు, 2 కోట్ల నిధులను కూడా మంజూరు చేసిందని మంత్రులు ఈ సందర్భంగా తెలిపారు. నిర్మాణ పనుల ప్రారంభానికి ట్రస్ట్ కమిటీ సన్నాహాలు చేస్తున్నదని వివరించారు.
కార్యక్రమంలో ఆత్మగౌరవ భవన ట్రస్ట్ చైర్మన్ అసాని మారుతీసాగర్, తెలంగాణ సగర సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పరి శేఖర్సాగర్, గౌరవ అధ్యక్షుడు ముత్యాల హరికిషన్సాగర్, ప్రధాన కార్యదర్శి గోరక సత్యం సాగర్, రాష్ట్ర నాయకులు బంగారు నరసింహసాగర్, విజయేంద్రసాగర్, పురుషోత్తం సాగర్, రవిసాగర్, వెంకట్స్వామి సాగర్, తిరుపతయ్య సాగర్, కృష్ణసాగర్, ఉదయసాగర్, దయాసాగర్, రామకృష్ణ సాగర్, శ్రీరాములు సాగర్, సీతారాంసాగర్ తదితరులు పాల్గొన్నారు.