జనగాం : రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ఆదివారం పాలకుర్తి జాతరలో పరిశుభ్రత పనితీరును పరిశీలించారు. దేవాలయ ప్రాంగణమంతా కలియ తిరుగుతూ దుకాణాల వద్ద పరిశుభ్రత గురించి పలు సూచనలు చేశారు. పరిశుభ్రతను పాటించని యజమానులపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిశుభ్రత ప్రజలకు అవగాహన పెంచాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
శివ పార్వతుల కల్యాణం, జాతర ఘనంగా నిర్వహించడానికి సహకరించిన వారికి కృతజ్ఞతలు తెలిపారు. చెత్త చెదారం ఉన్న దుకాణం వద్దకు వెళ్లి అధికారులతో జరిమానాలు విధించారు. రోడ్లపై చెత్త చెదరాలు వేయొద్దని జాతరకు వచ్చిన భక్తులకు పిలుపునిచ్చారు. అనంతరం మహబూబాబాద్ జిల్లా తొర్రూరు బీఆర్ఎస్ కార్యాలయంలో జరిగిన శివాజీ మహారాజ్ జయంతి వేడుకల్లో మంత్రి పాల్గొని శివాజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.