హైదరాబాద్ : టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ఖరారైన గుత్తా సుఖేందర్ రెడ్డి, కడియం శ్రీహరి, బండ ప్రకాష్, తకెళ్లపల్లి రవీందర్ రావు, పాడి కౌశిక్ రెడ్డి, మాజీ కలెక్టర్ వెంకట్రామిరెడ్డిలకు పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు శుభాకాంక్షలు తెలిపారు. సీఎం కేసీఆర్ దిశానిర్దేశం, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నాయకత్వంలో అభ్యర్థుల ఎంపికలో సామాజిక సమతూకం పాటించారన్నారు. టీఆర్ఎస్లో అర్హులు, ప్రతిభావంతులైన వాళ్లకు సముచిత గౌరవం లభిస్తుందన్నారు.