హైదరాబాద్ : రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డికి పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎంపీలు రంజిత్ రెడ్డి, వెంకటేష్ నేత తదితరులు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.
సోమవారం మంత్రుల నివాసంలోని ఆయన ఇంటికి వెళ్లిన మంత్రి, వేములకు పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. వేముల ప్రశాంత్ రెడ్డి సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఉండాలని, ప్రజా సేవ చేయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు.