పాలకుర్తి : ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు(CM KCR) నాయకత్వం రాష్ట్రానికే కాదు, దేశానికి కూడా అవసరమని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ మంచినీటి సరఫరాశాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు(Minister Errabelli) అన్నారు. జనగామ జిల్లా పాలకుర్తి శివారులో నిర్వహించిన బీఆర్ఎస్(BRS) ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ .. తెలంగాణ సాధనకు అహర్నిశలు కష్టపడ్డ కేసీఆర్ సీఎం కావడంతో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని అన్నారు. బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని వెల్లడించారు. ఎన్నికల మెనిఫెస్టోలో చెప్పినవి, చెప్పనవి కూడా అమలు చేశారని పేర్కొన్నారు. ముక్కు,మొహం తెలియని వారు వచ్చి చెప్పే మాటాలను ప్రజలు నమ్మవద్దని సూచించారు.
కాంగ్రెస్ పార్టీ కల్లబొల్లి కబుర్లు చెబుతున్నదని, బీజేపీ బోగస్ మాటలతో ముందుకు వస్తున్నదని విమర్శించారు. ఈ రెండు పార్టీల వల్లే దేశం సర్వనాశనం అయిందని ఆరోపించారు.అన్నారు.‘ రాష్ట్రాన్ని ఎన్టీఆర్ తర్వాత కేసీఆరే అద్భుతంగా తీర్చిదిద్దారు. 40 ఏండ్ల రాజకీయ జీవితంలో ఇలాంటి సీఎంలను చూడలేద’ని మంత్రి పేర్కొన్నారు. రైతు బంధు, 24 గంటల కరెంట్, ఆసరా పింఛన్లు, కల్యాణ లక్ష్మి(Kalyanalaxmi), కేసీఆర్ కిట్(KCR KIT) తదితర పథకాలు కొనసాగి మరింత అభివృద్ధి చెందాలంటే సీఎం కేసీఆర్ ప్రభుత్వాన్ని, తనను మరోసారి ఆశీర్వదించాలని ప్రజలను కోరారు.