జనగామ : సర్దార్ సర్వాయి పాపన్న (Sardar Sarvai Papanna) పోరాటం భావి తరాలకు స్ఫూర్తి
అని రాష్ట్ర పంచాయతీ , గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ( Minister Errabelli) అన్నారు. పాపన్న జయంతి సందర్భంగా పాలకుర్తి నియోజకవర్గం తొర్రూరులో సర్వాయి పాపన్న విగ్రహానికి పూలమాలవేసి పుష్పాంజలి ఘటించారు. పెద్ద వంగర మండలం కాన్వాయి గూడెం లలో సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహాన్ని ఆవిష్కరించి మాట్లాడారు.
సర్దార్ సర్వాయి పాపన్న గొప్ప పోరాట యోధుడని అన్నారు. సామాన్య కుటుంబం లో పుట్టి, గొప్ప స్థాయికి ఎదిగిన వ్యక్తని పేర్కొన్నారు. నిజాం పాలన పై తిరుగుబాటు చేసి యుద్ధం ప్రకటించారని తెలిపారు. ఆయన మన ప్రాంతంలో పుట్టడం మనందరి అదృష్టమని వెల్లడించారు. పాపన్న జయంతి, వర్ధంతి లను ప్రభుత్వమే నిర్వహిస్తుందని గుర్తు చేశారు.
సీఎం కేసీఆర్(CM KCR) మనసున్న మహారాజని, హైదరాబాద్ లో 5 ఎకరాల స్థలం లో సర్వాయి పాపన్న పేరుతో భవనం ఏర్పాటు చేస్తున్నారని వెల్లడించారు. గౌడ కులస్తులకు వైన్ షాపుల్లో 15శాతం రిజర్వేషన్లు కల్పించారని వివరించారు. అనంతరం కాన్వాయ్ గూడెంలో పరువురికి కల్యాణ లక్ష్మి (Kalyanalaxmi) , షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాల్లో స్థానిక ప్రజాప్రతినిధులు, గౌడ సంఘాల ప్రతినిధులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.