మహబూబాబాద్ : అభివృద్ధి, సంక్షేమ పథకాలు కొనసాగాలంటే రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ మళ్లీ గెలువాల్సిన అవసరం ఉందని పాలకుర్తి బీఆర్ఎస్ అభ్యర్థి, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు(Minister Errabelli ) అన్నారు. శుక్రవారం పెద్ద వంగర మండలంలోని వివిధ గ్రామాల్లో విస్తృతంగా పర్యటించారు. మంత్రికి బతుకమ్మలు, కోలాటాలు, డప్పులతో ప్రజలు ఘనంగా స్వాగతం పలికారు. ప్రజలతో మమేకమై వారితో కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా ఆయా చోట్ల ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్తోనే అభివృద్ధి సాధ్యమన్నారు. ఈ ఎన్నికల్లో తనను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.