హనుమకొండ : వరంగల్ లోని కాకతీయ మెడికల్ కాలేజీ(KMC) మరమ్మతులకు మంజూరు చేసిన రూ. 2. 5 కోట్ల నిధులతో నాణ్యతతో కూడిన పనులు చేపట్టాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు(Minister Errabelli) ఆదేశించారు.నిధులు మంజూరు చేసినందుకు గాను ఆ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ మోహన్ దాస్ బుధవారం ఆర్ అండ్ బీ అతిథి గృహంలో మంత్రిని కలిసి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా నిధుల వినియోగ తీరును ప్రిన్సిపాల్ వివరించారు. కాకతీయ మెడికల్ కాలేజీలో గర్ల్స్ హాస్టల్, జూనియర్ డాక్టర్స్ హాస్టల్ మరమ్మతులతో పాటు పీ జీ హాస్టల్ ఫర్నీచర్ కోసం వినియోగించనున్నామని తెలిపారు. దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న ఈ సమస్యలు త్వరలోనే పరిష్కారం అవుతుందన్నారు. ప్రభుత్వం మంజూరు చేసిన నిధులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.