జనగామ : జనంతో ఇట్లే కలిసిపోయి, వాళ్లతో పాటు ఆడుతూ..పాడుతూ వారిలో ఒకడిగా నిలిచే మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మరోసారి తను మాస్కు మాస్ లీడర్ నని మరోసారి నిరూపించారు. జిల్లా పర్యటనలో భాగంగా తనకు ఎదురైన గిరిజన మహిళలతో వారి కోరిక మేరకు కోలాటం ఆడి ఆనంద పరిచారు.
వివరాల్లోకి వెళ్తే.. జిల్లాలోని దేవరుప్పుల మండలంలో కడవెండి-పొట్టిగుట్ట శివారులోని వానకొండయ్య లక్ష్మీనరసింహస్వామి ఉత్సవాలకు హాజరయ్యేందుకు వెళ్తూండగా.. మార్గం మధ్యలో గిరిజన మహిళలు హోలీ ఆడుతూ కనిపించారు. వారిని చూసిన మంత్రి తన వాహనాన్ని ఆపి, వారిని పలకరించారు. మంత్రితో కలిసిపోయిన గిరిజన మహిళలు ఆయనకు బొట్లు పెడుతూ తమతోపాటు హోలీ అలాగే కోలాటం ఆడాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. వారి కోరికను మన్నించిన మంత్రి వారితో కొద్దిసేపు చప్పట్లు కొడుతూ.. ఆడి పాడి ఉత్తేజపరిచారు.