స్టేషన్ ఘన్పూర్/జనగామ : స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య తల్లి లక్ష్మి పార్థీవ దేహానికి పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పుష్ప గుచ్చం ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు. ఎమ్మెల్యే రాజయ్య కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థించారు. ఆమె కుటుంబానికి తన ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. కాగా, రాజయ్య తల్లి లక్ష్మి (87) బుధవారం హన్మకొండలోని రాజయ్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్(RMH) లో అనారోగ్యంతో చికిత్స పొందుతూ మృతి చెందారు.