వరంగల్ : భారతీయ బౌద్ధ మహాసభ జాతీయ కార్యదర్శి, రాష్ట్ర మైనార్టీ కమిషన్ సభ్యుడు దివంగత బొమ్మల కట్టయ్య ప్రథమ వర్ధంతి (పుణ్యాను మోదన) కార్యక్రమానికి పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హాజరయ్యారు. వరంగల్లోని కట్టయ్య నివాసంలో ఆయన చిత్రపటానికి పూల మాలవేసి నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ..బుద్ధుడు, అంబేద్కర్ చూపిన మార్గంలో నడుస్తూ బొమ్మల కట్టయ్య ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేపట్టారన్నారు.కట్టయ్యతో తనకు అనుబంధాన్ని మంత్రి గుర్తు చేసుకున్నారు. వారు సమాజానికి చేసిన సేవలను కొనియాడారు. మంత్రి వెంట వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్, స్థానిక ప్రజాప్రతినిధులు, తదితరులు ఉన్నారు.