వరంగల్: అభివృద్ధి, సంక్షేమం కొనసాగేందుకు మరోసారి తనను ఆశీర్వదించాలని, కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రిని చేయాలని పాలకుర్తి బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు(Minister Errabelli) ప్రజలను కోరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం రాయపర్తి మండలంలోని తిరుమలాయపల్లి, రాయపర్తి గ్రామాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. స్థానిక ప్రజలు ఆయనకు డప్పు చప్పుళ్లు, మంగళహారతులతో ఘన స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..తెలంగాణ రాష్ట్ర అభివవృద్ధి సీఎం కేసీఆర్తోనే సాధ్యమవుతుందన్నారు. ఇచ్చిన హామీలతో పాటు చెప్పనివి కూడా చేశామన్నారు. కాంగ్రెస్ పార్టీ సాధ్యం కానీ హామీలతో ప్రజలను మోసం చేస్తుందని ఆరోపించారు. ఆ పార్టీకి ఓటేస్తే కరెంట్ కష్టాలు తప్పవన్నారు. సాగుకు మూడు గంటల కరెంట్ చాలన్న ఆ పార్టీకి బుద్ధి చెప్పాలన్నారు. మంత్రి వెంట బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.