హైదరాబాద్ : దశాబ్ది వేడుకలను విజయవంతం చేయాల్సిన అధిక బాధ్యత పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలపై ఉందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు(Minister Errabelli) అన్నారు. మంగళవారం హైదరాబాద్ సచివాలయం నుంచి దశాబ్ది వేడుకలపై నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్(Video Conference)లో మాట్లాడారు.
జూన్ 2 నుంచి ప్రారంభం కానున్న తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ముఖ్యంగా ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు గ్రామీణ పరిధిలో అనేకం ఉన్నాయని తెలిపారు. పంచాయతీరాజ్(Panchayatraj)తో పాటు గ్రామీణాభివృద్ధి(Rural Development), మిషన్ భగీరథ ,పల్లెప్రగతి లాంటి తదితర పథకాలను ప్రభుత్వం విజయవంతంగా చేపట్టిందని అన్నారు.
ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల ప్రకారం వేడుకల్లో ఆయా శాఖల అధికారులు ప్రజాప్రతినిధులు ప్రజల భాగస్వామ్యంతో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. మిగతా శాఖలకు భిన్నంగా ఎక్కువ శాఖలతో ఎక్కువ అనుబంధం ఉందని పేర్కొన్నారు. రైతు, విద్యుత్, సాగునీటి,దినోత్సవం పండుగలను చెక్ డ్యాం ల వద్ద ఏర్పాటు చేసుకోవాలన్నారు.
8వ తేదీన గ్రామాల్లో చెరువుల పండుగ సందర్భంగా ప్రజలను చెరువుల వద్దకు తీసుకెళ్లాలని సూచించారు. 13న మహిళా దినోత్సవాన్ని మహిళలు, డ్వాక్రా సంఘాలు, వీవోఏలు, సెర్ప్ ఉద్యోగులు అందరినీ భాగస్వాములను చేయాలని ఆదేశించారు.
పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా గ్రామాలు బాగుపడ్డ తీరుని వివరించాలన్నారు. పల్లెల అభివృద్ధికి పాటు పడిన పారిశుద్ధ్య కార్మికులను సత్కరించాలని సూచించారు. హరిత హారం కింద నాటిన మొక్కలను 98శాతం సంరక్షించుకున్నామని దీని ద్వారా వాటి ద్వారా 7.7 శాతం గ్రీనరీ పెరిగిందన్నారు.