హైదరాబాద్ : ఎమ్మెల్సీ ఎల్ రమణ తండ్రి ఎల్జీ రాం ఇటీవల మృతి చెందగా, మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు (Minister Errabelli ) ఆదివారం ఎమ్మెల్సీ ఎల్. రమణను పరామర్శించారు. జగిత్యాలలోని రమణ ఇంటికి చేరుకున్న మంత్రి ఎల్జీ రాం చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఎల్.రమణ కుటుంబసభ్యులను పరామర్శించారు. ఎల్జీ రాం చేసిన వ్యా పారాలు, నియోజకవర్గ ప్రజలకు ఎల్జీ రాం హెల్త్కేర్ ద్వారా అందించిన వైద్య సేవలను ఎల్ రమణను అడిగి తెలుసుకున్నారు. వారి కుటుంబానికి మంత్రి ఎర్రబెల్లి ప్రగాఢ సానుభూతి తెలిపారు.