వరంగల్ : ఈ నెల 27న జిల్లాలోని భట్టుపల్లిలో నిర్వహించనున్న సీఎం కేసీఆర్(CM KCR) వర్ధన్నపేట ప్రజా ఆశీర్వాద సభా స్థలిని స్థానిక ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ నియోజకర్గ అభ్యర్థి ఆరూరి రమేష్తో కలిసి పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు(Minister Errabelli )పరిశీలించారు. ఈ సందర్భంగా అక్కడ జరుగుతున్న ఏర్పాట్లను స్థానిక ఎమ్మెల్యే రమేష్ వివరించగా, మంత్రి ఎర్రబెల్లి ఏర్పాట్ల విషయంలో పలు సూచనలు చేశారు.
కాగా, ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం కేసీఆర్ నిర్వహిస్తున్న ప్రజా ఆశీర్వాద సభల షెడ్యూల్లో స్వల్ప మార్పు చోటు చేసుకున్నది. నూతన షెడ్యూల్ ప్రకారం ఈ నెల 26న అచ్చంపేట, వనపర్తి, మునుగోడులో నిర్వహించే సభల్లో సీఎం పాల్గొననున్నారు. 27న పాలేరు, మహబూబాబాద్, వర్దన్నపేటల్లో సీఎం కేసీఆర్ సభలు జరుగనున్నాయి. మిగతా సభలు యథావిధిగా జరుగనున్నాయి.