మహబూబాబాద్ : సినిమాలను థియేటర్లలో చూస్తే వచ్చే ఆనందమే వేరని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ( Minister Errabelli) అన్నారు. పాలకుర్తి నియోజకవర్గం తొర్రూరు పట్టణంలో పునరుద్ధరించిన అశ్విని సినిమా థియేటర్ను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి ‘జయం మనదే’ సినిమాను కొద్దిసేపు వీక్షించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. సినిమా నిర్మాణం ఎంతో ఖర్చుతో కూడుకున్న పని అని, జనం సినిమాలను థియేటర్లలోనే చూడాలన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ సినీ పరిశ్రమ అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నారని చెప్పారు. మంత్రి వెంట స్థానిక ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు, తదితరులు ఉన్నారు.