జనగామ : సీఎం కేసీఆర్ అంగన్వాడీలకు అండగా ఉంటున్నారు. అరకొర జీతాలతో ఇబ్బంది పడుతున్న వారి దయనీయస్థితిని చూసి రాష్ట్ర ప్రభుత్వం జీతాలు పెంచిందన్నారు.
ఆగస్టు 01 నుంచి 7 వరకు వారం రోజుల పాటు నిర్వహించే తల్లి పాల వారోత్సవాల సందర్భంగా పాలకుర్తి మండల కేంద్రంలో గల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఐ. సి.డి.ఎస్ ప్రాజెక్టు కొడకండ్ల సెక్టార్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా అంగన్వాడీ టీచర్లకు చీరెలు, ఎదుగుదల లేని పిల్లలకు పౌష్టికాహారం బ్యాగులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో డి.ఆర్.డి.ఓ రాంరెడ్డి, ఎంపీడీఓ అశోక్ కుమార్, అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.