జనగామ : వరంగల్ పర్యటనకు వెళ్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్కు జనగామ జిల్లా పెంబర్తి కాకతీయ కళాతోరణం వద్ద మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్వాగతం పలికారు. మంత్రి దయాకర్ రావుతో పాటు ఎంపీ రవించంద్ర, ఎమ్మెల్యే డాక్టర్ రాజయ్య, రెడ్కో చైర్మన్ సతీష్ రెడ్డి, జనగామ జెడ్పీ చైర్మన్ సంపత్ రెడ్డి తదితరులు ఉన్నారు. అంతకుముందు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రతిమ హాస్పిటల్ను సందర్శించి, ఏర్పాట్లను పరిశీలించారు.