హైదరాబాద్ : రాష్ట్రంలో జాతీయ ఉపాధి హామీ పథకం కింద పనిచేసిన కూలీలకు కేంద్రం రెండు నెలలుగా వేతనాలు చెల్లించకపోవడం పట్ల రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ పట్ల కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సవతి తల్లి ప్రేమ, పక్షపాత ధోరణి కనబరుస్తుందని ఆరోపించారు.
ఉపాధి హామీ పథకం కింద దాదాపు లక్షా 25వేల మంది కూలీలకు రెండు నెలల వేతనాలు రూ. 110.35లక్షలు విడుదల చేయాలని కేంద్ర పంచాయతీరాజ్ మంత్రికి లేఖ రాశారు. వెంటనే నిధులు విడుదల చేసి కూలీలను ఆదుకోవాలని కోరారు.