శంషాబాద్ మండలం ముచ్చింతల్లో ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త శ్రీ చిన్నజీయర్ స్వామి ఆశ్రమాన్ని రాష్ట్ర పంచాయితీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సోమవారం సందర్శించారు.ఆశ్రమంలో రామనుజుడి సహస్రాబ్ది ఉత్సవాల సందర్భంగా నిర్వహిస్తున్న యాగశాలలో 1035 కుండ శ్రీలక్ష్మీ నారాయణ మహాక్రతువు, 108 దివ్యదేశ ప్రతిష్ఠ, కుంభాభిషేకము, స్వర్ణమయ శ్రీరామానుజ ప్రతిష్ఠ కార్యక్రమాల పనులను మంత్రులు పరిశీలించారు. అనంతరం భద్రత ఏర్పాట్ల పై జరిగిన సమీక్షా సమావేశంలో పాల్గొని సూచనలు చేశారు.