హైదరాబాద్ : బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కొత్త ప్రభాకర్రెడ్డి(Kotha Prabhakar Reddy)పై దాడి జరుగడం దారుణం. ప్రజాస్వామ్యంపై నమ్మకం లేని వాళ్లే ఇలాంటి దాడులకు పాల్పడుతుంటారని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు(Minister Errabelli) అన్నారు. నిన్న దుబ్బాక నియోజకవర్గంలో కత్తి పోటుకు గురై సికింద్రాబాద్ యశోద హాస్పిటల్లో చికిత్స పొందుతున్న ప్రభాకర్ రెడ్డిని మంత్రి ఎర్రబెల్లి పరామర్శించారు. ప్రభాకర్ రెడ్డి కుటుంబ సభ్యులతో మాట్లాడి జరిగిన ఘటనను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో హత్యా రాజకీయాలకు తావు లేదు. దోషులపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఓట్ల కోసం నీచ రాజకీయాలకు పాల్పడుతున్న పార్టీల తీరును ప్రజలు గమనించాలన్నారు. అలాంటి వారికి ఓటు అనే ఆయుధంతో తగిన బుద్ధి చెప్పాలన్నారు. కొత్త ప్రభాకర్ రెడ్డి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు.